- Advertisement -
ప్రపంచకప్ మనదే..
నవతెలంగాణ-హైదరాబాద్ :
భారత మహిళల క్రికెట్లో సువర్ణాధ్యాయం లిఖితమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. తొలిసారి టీమ్ఇండియా ప్రపంచకప్ (Womens World Cup)ను ఒడిసిపట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు, టీవీ, మొబైల్ తెరలకు అతుక్కుపోయిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్లతరబడి ఎదురుచూసిన భారతావని ఒక్కసారిగా పులకించిపోయింది.
- Advertisement -



