కలెక్షన్ కింగ్గా పేరొందిన నటుడు, నిర్మాత, విద్యావేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 22న ఓ గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. ఈ అసాధారణ ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో ‘ఎంబి 50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది దిగ్గజ నటుడిని, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ ఈవెంట్ను జరుపబోతున్నారు. ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు విష్ణు మంచు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా మోహన్ బాబు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. తన శక్తివంతమైన ప్రదర్శనలు, ఐకానిక్ డైలాగ్ డెలివరీ, తెరపై చూపించిన ప్రతిభ ఎందరికో స్పూర్తిగా నిలిచింది.
600కి పైగా చిత్రాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞ, క్రమశిక్షణ, కళ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని చాటాయి. ఎంబి 50 అంటే కేవలం సినీ విజయాలే కాకుండా.. కళ, విద్య, దాతత్వం పట్ల ఆయన జీవితాంతం చూపిన నిబద్ధతను కూడా సూచిస్తుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఒంటరిగా సినీ ప్రయాణం మొదలు పెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న విలక్షణ నటుడుగా ఎదిగిన ఈ జర్నీ గురించి అందరికీ మరోసారి చాటి చెప్పబోతున్నారు. మోహన్ బాబు ఇండస్ట్రీలో స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విష్ణు మంచు నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇతర విషయాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
అసాధారణ ప్రయాణానికి అరుదైన వేడుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



