Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్ష : ఎస్ఐ

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్ష : ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ- పెద్దకొడప్ గల్ 
మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ అరుణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ.10 వేల జరిమానా విధించడం లేదా ఆరు నెలలు జైలు శిక్ష అమల్లోకి రావడం జరిగిందిఅలాగే ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి రెండవసారి వాహనం నడుపుతూ పట్టుపడితే రూ.15 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. జరిమానా డబ్బులు చెల్లించని వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదన్నారు.

వాహనదారులు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అలాగే మైనర్లు వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ మార్చి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వాహనాలు నడిపేటప్పుడు వ్యక్తిగత భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -