- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. తర్వాత నష్టాల బాటపట్టాయి. ముఖ్యంగా మెటల్, పవర్, రియాల్టీ, మీడియా రంగాల్లో అమ్మకాల కారణంగా సూచీలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 140 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 87 పాయింట్ల మేర క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 63 డాలర్ల వద్ద కొనసాగతుండగా.. బంగారం ఔన్సు మళ్లీ 4వేల డాలర్ల మార్కు ఎగువన ట్రేడవుతోంది.
- Advertisement -



