నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి సెయింట్ పాల్ హైస్కూల్లో మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో చేస్తున్న మా ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 28 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వంతుగా స్వచ్ఛ కార్యక్రమలో పాల్గొనాలన్నారు. అనంతరం స్వచ్చంద సేవా సభ్యులను పాఠశాల సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కేథరిన్ పాల్, కరస్పాండెంట్ ఇనాక్ పల్, వైస్ ప్రిన్సిపాల్ సిసిలియా ఏంజిల్ ,సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్ నరేంధర్, గుర్రం రాకేష్, వంట నరేష్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
సెయింట్ పాల్ హైస్కూల్లో స్వచ్ఛ భారత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



