- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్ దానాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు. వారు నిద్రలో ఉన్న సమయంలో పైకప్పు కూలడంతో శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారు. మృతులు మహ్మద్ బబ్లు (35), అతని భార్య రోషన్ ఖటూన్ (30), పిల్లలు రుసర్ (12), మహ్మద్ చంద్ (10), చాందినీ(2)గా గుర్తించారు. స్థానికులు శిథిలాల కింద ఉన్న బాడీలను వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



