నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ లోని ఏ అణు కేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ జరగలేదని గ్లోబల్ న్యూక్లియర్ వాచ్ డాగ్ అయిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(IAEA) ప్రకటించింది. ఇటీవల, భారత త్రివిధ దళాల సైనికాధికాల సమావేశంలో కూడా ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. తాము కిరాణా హిల్స్పై దాడి చేయాలేదని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో ఆగ్రహించిన భారత్..ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాక్ లోని పలు ఉగ్రవాదుల శిబిరాలపై భీకర దాడులు చేసి..100మందిగా తీవ్రవాదులను మట్టుబెట్టారు. అయితే, ఈ ఆపరేషన్లో భారత్ పాకిస్తాన్ అణుస్థావరాలపై కూడా దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని సర్గోదా ఎయిర్ బేస్కి సమీపంలో ఉన్న కిరాణా హిల్స్పై భారత్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వాదనల్ని ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఖండించారు. భారత్ అక్కడ దాడి చేయలేదని చెప్పారు. తాజాగా ఈ వివాదంపై అణు ఇంధన సంస్థ క్లారిటీ ఇచ్చింది.
పాక్లో రేడియేషన్ లీక్ జరగలేదు: IAEA
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES