- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. దీనికి బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. ఢిల్లీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటన తనను కలచివేసిందన్నారు.
- Advertisement -



