నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్లో రెండో విడత పోలింగ్తో పాటు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ పోలింగ్ నిర్వహించారు. జమ్ముకశ్మీర్ లోని బుడ్గాం, నగరోటా, అంటా(రాజస్థాన్), ఘాట్శీల(జార్ఖండ్), జూబ్లీహీల్స్(తెలంగాణ), టార్న్ తరణ్(పంజాబ్), డంపా(మిజోరం), నువాపాడ(ఒడిసా) అసెంబ్లీ స్థానాలకు బైఎలక్షన్స్ జరగనున్నాయి.
జమ్మూ కాశ్మీర్లోని బుద్గాంలో, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఆఘా మెహమూద్, పీడీపీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ మెహదీపై పోటీ చేయనున్నారు. ఒమర్ అబ్దుల్లా బుద్గాం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గండేర్బల్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్న తర్వాత ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
2005 కేసులో దోషిగా తేలిన తర్వాత (బీజేపీ) నాయకుడు కన్వర్ లాల్ మీనా అనర్హత వేటు పడింది. ప్రభుత్వ అధికారిని బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఈ ఏడాది మేలో దోషిగా నిర్ధారించబడ్డారు. దీంతో రాజస్థాన్ లోని అంటా నియోజకవర్గానికి ఎన్నిక అనివార్యమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిట్టింగ్ ఎమ్మెల్యే కాశ్మీర్ సింగ్ సోహల్ ఈ ఏడాది జూన్లో మరణించారు. టార్న్ తరణ్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిట్టింగ్ ఎమ్మెల్యే కాశ్మీర్ సింగ్ సోహల్ ఈ ఏడాది జూన్లో మరణించారు. టార్న్ తరణ్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.
అలాగే తెలంగాణలోని జూబ్లీహీల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం చెందారు. దీంతో ఆయన మృతితో జూబ్లీహీల్స్ అసెంబ్లీ స్థానానికి బైపోల్ అనివార్యమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోపినాథ్ సతిమణి సునీత, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు.



