నవతెలంగాణ-పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొత్త పెండ్లి జంటను ఏకే పౌండేషన్ ఛైర్మెన్,హైకోర్టు న్యాయవాది కట్టేబోయిన అనిల్ కుమార్ ఆశీర్వదించారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన జానపాటి పాపయ్య యాదవ్-పద్మల కుమారుడు నాగరాజు యాదవ్-యామినిల పెండ్లికి హాజరయ్యారు.
అలాగే హాలియా మున్సిపాలిటీ కేంద్రం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రానికి చెందిన నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు సండ్రాల కొండల్ యాదవ్ – రమల నూతన గృహప్రవేశ మహోత్సవం లో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కట్టెబోయిన సైదులు, నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు చిలుకల కాశయ్య యాదవ్, గౌని లింగయ్య, కట్టెబోయిన రవి, బొడ్డు వెంకన్న, మన్నెం కోటి, బిసి సంఘం నాయకులు గంగుల అంజి యాదవ్, రావుల రాము యాదవ్, శేఖర్ గౌడ్, బొమ్మిశెట్టి రామలింగయ్య, పులి నరేష్, పాల్గొన్నారు.



