- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. ఈ మేరకు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారి మృతదేహాలకు వారి మత ఆచారం ప్రకారం అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించింది.
- Advertisement -



