Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి..

ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి..

- Advertisement -

– ఎంపీడీవో కృష్ణయ్య..
నవతెలంగాణ – ఊరుకొండ 

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి పరిశీలనలో భాగంగా మండల పరిధిలోని ముచ్చర్లపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పరిశీలించగా, గ్రామానికి మంజూరు అయిన మొత్తం 17 ఇండ్లకు గాను నేటి వరకు బిలో బేస్మెంట్ పనులు జరుగుచున్నవి 2 ఇండ్లు, బేస్మెంట్ పని పూర్తి అయినవి 4 ఇండ్లు, రూఫ్ లెవెల్ పూర్తి అయినవి 3 ఇండ్లు, గోడలపని నడుస్తున్నవి 3 ఇండ్లు,  స్లాబ్ పని పూర్తి అయినవి 2 ఇండ్లు,  వివిధ కారణాలతో ఇంకా నిర్మాణం చేపట్టనివి 3 ఇండ్లు ఉన్నట్లు ఎంపీడీవో తెలిపారు. గ్రామానికి వివిధ దశల్లో పూర్తి అయిన ఇండ్లకు మొత్తం రూ.8.00 లక్షలు విడుదల కాబడినవని వివరించారు. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో  ఎంపీఓ లక్ష్మణ్ నాయక్, పంచాయతీ కార్యదర్శి బాలస్వామి, గ్రామస్థాయి సిబ్బంది, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -