Sunday, June 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబస్టాండ్లలో శానిటరీ నాప్కిన్‌ వెండింగ్‌ మిషన్లు

బస్టాండ్లలో శానిటరీ నాప్కిన్‌ వెండింగ్‌ మిషన్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా సహేలి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ములుగు, హనుమకొండ బస్టాండ్లలో ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. . ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నెలసరి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ వినూత్న ఆలోచన చేసినట్లు తెలిపారు. సహిలి సంస్థను స్థాపించి మహిళ ఆరోగ్య విషయంలో పనిచేయడంపై మంత్రులు అభినందనలు తెలిపారు. బస్సులలో ప్రయాణం చేసే మహిళలు, అమ్మాయిలకు ఆకస్మికంగా నెలసరి సమస్యలు వస్తే ప్యాడ్స్ దొరక్క ఇబ్బందులు పడడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మిషన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. సహేలి సంస్థ ముందుకు రావడంతో మంచి పరిణామమని, సంస్థ వ్యవస్థాపకురాలు కొమ్ము అనుపమకు మంత్రులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -