- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాజీవ్ యువ వికాస పథకానికి జూన్ 2న రూ.1000 కోట్ల నిధులు విడుదల చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. నేడు నగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయిన “ఇందిరా జల వికాస” కార్యక్రమానికి హాజరైన భట్టి.. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అని.. ఇందిరమ్మ రాజ్యాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని ఆయన ఈ మేరకు ప్రజలకు పిలుపునిచ్చారు.
- Advertisement -