Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లె సారథులు వచ్చేస్తున్నారు.!

పల్లె సారథులు వచ్చేస్తున్నారు.!

- Advertisement -

22న నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియ డంతో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి నిర్ణయించింది. ప్రభుత్వం మొదట ఈ నెల 20న సర్పంచ్ల ప్రమాణ స్వీకార సమయం ఖరారు చేసింది. ఆ రోజు మంచిగా లేకపోవడం, శనివారం కావడంతో 22వ తేదీకి వాయిదా వేసింది. బాధ్యతలు చేపట్టనున్న కొత్త పాలకవర్గాలు గ్రామ పంచాయతీల్లో ఇరవై రెండున్నర నెలలుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.

2024 ఫిబ్రవరి 2న గత పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన పెట్టారు. అయితే పార్ల మెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికి బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కారణంగా అది జరగలేదు. దీంతో సంవత్సరం పదిన్నర నెలలుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ నెల 22వ తేదీన గ్రామ పంచాయతీలో కొత్త పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి.మండలంలో 15 గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన 15 మంది సర్పంచ్ బీలు,128 మంది వార్డు సభ్యులు ఈ నెల 22న కొలువుదీరనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్లు బాధ్యతలు చేపట్టడడంతో పంచాయతీ కార్యదర్శులకు భారం తగ్గనుంది. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -