- Advertisement -
నవతెలంగాణ – దుబాయ్: అండర్ 19 ఆసియా కప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. శ్రీలంకతో జరిగిన సెమీస్లో ఇండియా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత శ్రీలంక 138/8 పరుగులు చేసింది. అనంతరం భారత్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విహాన్ మల్హోత్రా (61*), ఆరోన్ జార్జ్ (58*) చెలరేగారు. మరో సెమీస్లో బంగ్లాదేశ్పై పాక్ గెలిచి ఫైనల్కు చేరింది. దీంతో దుబాయ్ వేదికగా భారత్, పాక్ల మధ్య డిసెంబర్ 21న ఫైనల్ జరగనుంది.
- Advertisement -



