Tuesday, May 20, 2025
Homeతాజా వార్తలుగుల్జార్‌హౌజ్‌ అగ్నిప్రమాదం..ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ

గుల్జార్‌హౌజ్‌ అగ్నిప్రమాదం..ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్‌ చౌరస్తా సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌లతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఈనెల 18న జరిగిన అగ్నిప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఘటనకు గల కారణాలు.. అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు సమగ్ర నివేదిక అందజేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలనూ నివేదికలో పొందుపరచాలని సూచించింది. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -