నవతెలంగాణ-హైదరాబాద్: టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగిన భారత కుర్రాళ్లకు అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఫైనల్లో భారత్ 191 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 172 పరుగులతో అద్భుత శతకం చేశాడు. అనంతరం 348 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ దారుణంగా విఫలమైంది. 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. వైభవ్ సూర్య వంశీ 26, కెప్టెన్ ఆయుష్ మాత్రే 2, ఆరోన్ జార్జ్ 16, విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిజ్ఞాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6, కిషన్ సింగ్ 3 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రెజా 4 వికెట్లతో భారత్ను దెబ్బతీశాడు. మహ్మద్ సయ్యాం 2, అబ్దుల్ సుభాన్ 2, హుజైపా అహ్సాన్ 2 వికెట్లు తీశారు.
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘోర పరాజయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



