- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని చర్చిలో గురువారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజుగౌడ్,మాజీ సర్పంచ్ అశోక్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టుకను స్మరిస్తూ నెల రోజులుగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఏసు అనుగ్రహాం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందారపు సారయ్య,నారమళ్ల రాజేశ్వరి,పాస్టర్ సుబాకర్,కాంగ్రెస్ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



