Monday, December 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ వద్దకు రేవంత్‌రెడ్డి వెళ్లి పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు ఆయనకు అభివాదం చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -