- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ ఆదివాసీ రైతుకు అరుదైన వజ్రం దొరికింది. ఏప్రిల్లో భూమి లీజుకు తీసుకున్న రాకేశ్, తన బంధువులతో కలిసి వజ్రాల వేట ప్రారంభించగా, రెండు నెలల తర్వాత 11.19 క్యారెట్ల వజ్రం లభించింది. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆశ్చర్యకరంగా, ఇదే కుటుంబానికి రెండేళ్ల క్రితం రూ.93 లక్షల విలువైన వజ్రం దొరికింది.
- Advertisement -



