- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ నటి మాధవీలతపై పోలీసు కేసు నమోదు అయింది. సాయిబాబాపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపై సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
- Advertisement -



