అభినందించిన ఉద్యానవన శాఖ కమిషనర్
క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రతిబింబించే విధంగా ‘నవతెలంగాణ’ 2026 క్యాలెండర్ను రూపొందించడం హర్షించదగ్గ విషయమని ఉద్యానవన శాఖ కమిషనర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. ఈ సందర్భంగా ‘నవతెలంగాణ’ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవనానికి సంబంధించిన చిత్రపటాలను ప్రత్యేకంగా గుర్తించి ప్రతి నెలకు ఒక ఉద్యాన పంటకు సంబంధించిన ఫొటోలు ప్రచురించడం, అది ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య మీడియా ఎప్పుడు వారధిగానే వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలపై తమ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఇలాంటి వినూత్న కార్యక్రమాలు, సూచనలు తమ డిపార్ట్మెంట్కు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ డిపార్ట్మెంట్ తరఫున సహకరించడానికి ముందంజలో ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మెన్ అవినాష్ రెడ్డి, ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్స్ రామలక్ష్మి, సంగీత లక్ష్మి, నవతెలంగాణ జనరల్ మేనేజర్లు ఎ. వెంకటేష్, నరేందర్ రెడ్డి, బత్తాయి రైతు సంఘం సభ్యులు ఎస్. వెంకట్ రెడ్డి, నవతెలంగాణ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, కె.వి.రమణ, నందకిషోర్, మురళీ, ఉద్యానవన శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యాన పంటలను ప్రతిబింబిస్తున్న’నవతెలంగాణ క్యాలెండర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



