- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పదో తరగతిలో ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్స్ రాకముందే ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కానీ నిన్న విడుదలైన ఫలితాల్లో ఆమెకు 480 మార్కులు వచ్చాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి తండాకు చెందిన సాయిప్రియ (17) పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో ఈ నెల 24న ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. నిన్న ఫలితాలు రాగా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
- Advertisement -



