
– అడుగడుగునా ఓటర్ల నీరాజనాలు
నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ బుధవారం రెండవ రోజు మండలంలో మల్లారంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.గడపగడపకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మండల ప్రజలు పుట్టకు పూల వర్షంతో బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా ఓటర్లు నీరాజనాలు పలుకుతున్నారు.పేద ప్రజల కోసం సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిపేస్టో తోపాటు తాను సొంతంగా చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దుసుకపోతున్నారు.పుట్ట విజయం ఇక తథ్యమే అన్నట్లుగా మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారం సాయంత్రం వరకు తాడిచెర్ల, చిన్నతూoడ్ల,పెద్దతూoడ్ల గ్రామాల్లో కొనసాగునట్లుగా మండల రైతు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు తెలిపారు.