- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. కోల్కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రేపు మే 9, 2026 (శనివారం) ఉదయం 11:00 గంటలకు.. కోల్కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
- Advertisement -



