- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వైభవ్ సూర్యవంశీ రికార్డులను తిరగరాస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 40 లోపు బంతుల్లోనే రెండు ఐపీఎల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ కూడా. శనివారం, సూర్యవంశీ మరో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో తొలి బంతికే సిక్సర్ కొట్టి, టీ20లలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 514 బంతుల్లోనే సిక్సర్ల ‘సెంచరీ’ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు కూడా ఇతనే కావడం గమనార్హం.
- Advertisement -



