- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు పసునూరి నరహరి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఝార్ఖండ్లోని సరండా ఫారెస్ట్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం కూంబింగ్ కొనసాగుతున్న క్రమంలో నరహరి తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి భార్య ఏపీకి చెందిన మహిళగా సమాచారం. 1996 నుంచి అజ్ఞాతంలో ఉన్న నరహరి పలు కీలక ఆపరేషన్స్లో పాల్గొన్నారు.
- Advertisement -



