- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ మళ్లీ విజృంభించింది. తాజా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 65 మంది మరణించగా, సుమారు 246 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా CDC సేకరించిన 20 శాంపిల్స్లో 13కి ఎబోలా సోకినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఇటూరి ప్రావిన్స్లో అత్యధిక మరణాలు సంభవించాయి. దీంతో, కాంగో సరిహద్దు దేశాలైన ఉగాండా, సౌత్ సూడాన్లను సీడీసీ అప్రమత్తం చేసింది. 1976లో కాంగోలోనే ఎబోలా తొలి కేసు నమోదైంది.
- Advertisement -



