Sunday, May 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅనుమానంతో భార్య‌పై ఇనుప రాడ్డుతో దాడి

అనుమానంతో భార్య‌పై ఇనుప రాడ్డుతో దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య.. తన భార్య జయలక్ష్మిపై ఇనుప రాడుతో దాడి చేశాడు. శుక్రవారం బాధితురాలు మేనత్త ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. అనుమానంతో తరచూ వేధింపులకు పాల్పడుతున్న నర్సయ్య, భార్య తలపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -