- ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా నిరహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ను కలిశారు. నీట్ పేపర్ లీకేజీ ను వ్యతిరేస్తూ కాక్రోజ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “యువత, సోనమ్ వాంగ్చుక్ చెప్పేది వినండి, లేకపోతే మూడేళ్ల తర్వాత, బీజేపీ ప్రభుత్వానికి)2014 లాంటి గతే పడుతుంది, విద్యా రంగంలో జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తూ యువత్ ఉద్యమం చేపట్టారు. “నేను కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నాను– ప్రధానమంత్రికి నా సూచన, ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించి, సోనమ్ వాంగ్చుక్ను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమించండి.” అని డిమాండ్ చేశారు.



