- Advertisement -
ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు
జాబ్ కార్డులున్న కూలిలు ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఉపాధిహామీ కూలీలకు సూచించారు. సోమవారం ఎడ్లపల్లిలో కొత్తకుంటలో ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్,పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,వార్డు సభ్యులు,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



