- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: లోక్సభ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల ఆరంభంలో స్పీకర్ ఓం బిర్లా మాజీ లోక్సభ సభ్యుడు సురూప్సింగ్ హిర్యా నాయక్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 2025 డిసెంబర్ 24న ఆయన మృతి చెందినట్లు సభకు తెలియజేశారు. సురూప్సింగ్ హిర్యా నాయక్ ప్రజాప్రతినిధిగా చేసిన సేవలను స్పీకర్ గుర్తు చేశారు. అనంతరం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించి ఆయనకు నివాళులు అర్పించారు.
- Advertisement -



