- Advertisement -
నవతెలంగాణ-మల్దకల్: మల్దకల్ మండలంలో పిడుగుపాటుకు పశువులు మృత్యవాత పడ్డాయి. సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన బంట్రోతు కుశలన్న అనే రైతుకు చెందిన.. రెండు కోడె దూడలు మృతి చెందాయి. గ్రామంలో ఉదయం కురిసిన వర్షంతోపాటు ఒక్కసారిగా పడిన పిడుగుకు లక్షపైగా విలువ చేసే కోడెదూడలు మృతి చెందాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



