Wednesday, June 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండోనేషియా అధ్యక్షునితో చైనా ప్రధాని భేటీ

ఇండోనేషియా అధ్యక్షునితో చైనా ప్రధాని భేటీ

- Advertisement -

జకార్తా : చైనా ప్రధాని లి కియాంగ్‌ ఆదివారం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియాంటోతో భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ మార్గాలపై చర్చలు జరపనున్నారు. బాహ్య సవాళ్లు పెరుగుతున్నప్పటికి ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని సాధించిందని ఉద్ఘాటించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని అన్నారు. ఏకపక్షవాదం, రక్షణ వాదం పెరుగుతున్నాయని, బెదిరింపు ప్రవర్తన పెరుగుతోందని అన్నారు. ఆదివారం సాయంత్రం ఇండోనేషియా – చైనా బిజినెస్‌ రిసెప్షన్‌లో లి కియాంగ్‌ ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు సుమారు 60 మంది ఈ సమావేశంలో పాల్గొననున్నారు.ఇండోనేషియాలో మూడు రోజుల పర్యటన కోసం శనివారం లి కియాంగ్‌ జకార్తా చేరుకున్నారు. ఇది ఈ ఏడాది లి కియాంగ్‌ మొదటి విదేశీ పర్యటన.ఇండోనేషియా, చైనాలు బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -