ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్(ఇప్టా) జాతీయ ఉపాధ్యక్షులు కందిమల్ల ప్రతాపరెడ్డి
నవతెలంగాణ-హిమాయత్ నగర్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరులో కళారూపాలను తయారు చేసి జన చైతన్యంలోకి హుతమిచ్చిన గొప్ప సంస్థ ప్రజా నాట్యమండలి అని ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు కందిమల్ల ప్రతాపరెడ్డి అన్నారు. అసోసియేషన్ 83వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం హిమాయత్ నగర్లోని ఎన్.సత్యనారాయణరెడ్డి భవన్లో ప్రముఖ విప్లవ నటుడు మాదాల రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1943 మే 25న దేశంలో ఉన్నతమైన లక్ష్యాలతో అసోసియేషన్ ప్రారంభమైందని, యుద్ధాలకు వ్యతిరేకంగా అటు స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కళారూపాలను తయారు చేసి ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప సంస్థ అని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం స్వాతంత్య్ర పోరాటంలో సాంస్కృతిక ఉద్యమం సాగిందని తెలిపారు. నేడు కులం, మతం పేరిట ప్రజలు కొట్టుకుచస్తున్నారని, కులరహిత సమాజం కోసం ప్రజా కళాకారులు తమ కళలు, సాహిత్యం ద్వారా చైత్యన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంద న్నారు. ప్రముఖ విప్లవ నటులు, దర్శకులు మాదాల రంగారావు జయంతి సందర్భంగా ఎర్రమల్లెలు, ఎర్ర సూర్యుడు, విప్లవ శంఖం సినిమాల్లోని పాటలు పాడుతూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మినారాయణ, సహాయ కార్యదర్శి కేతరాజు ఉప్పలయ్య, కార్యవర్గ సభ్యులు డి.వేణుగోపాల్, జనసేవా దళ్ నాయకులు మురళీకృష్ణ, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా నాయకులు కాంపల్లి కళ్యాణ్, అనిల్ కుమార్, కళాకారులు రాము, శేఖర్, విజరు కుమార్, భాస్కర్, మహేష్, పరుశురాం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరులో ప్రజా నాట్యమండలి కళారూపాల పాత్ర గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES