నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో గురువారం వాటర్కు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇంట్రా డీఈ పద్మావతి, ఏఈ సుప్రియ,పంచాయతీ కార్యదర్శి శ్రీలత,మల్టీ పర్పస్ వర్కర్ మల్లం సంజీవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థలో పలు సమస్యలు తలెత్తినట్లు తెలిపారు. వాటర్ ట్యాంకుకు సంబంధించిన గేట్ రిపేర్ కావడంతో నీటి లీకేజీ సమస్య ఏర్పడి నీరు వృథాగా పోతుందని పేర్కొన్నారు.
అలాగే కొత్త కాలనీలో నల్లాల సంఖ్య పెరగడంతో చివరి ఇళ్లకు నీరు సరైన విధంగా అందడం లేదని వివరించారు. దండు కుమార్ ఇంటి వద్ద బోరు మోటార్ నుంచి వచ్చే పైపు లైన్ గత 20 సంవత్సరాల క్రితం వేసినదిగా, ప్రస్తుతం లీకేజీ అవుతూ నీరు వృథా అవుతున్నందున కొత్త పైపు లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇక కొత్తగా వేసిన బోర్లో దించేందుకు 100 ఫీట్ల ఐరన్ పైపులు అవసరమని, అలాగే కొత్త పైపు లైన్ నిర్మాణం కోసం సుమారు 250 మీటర్ల పైపులు కావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.



