Sunday, February 8, 2026
E-PAPER
Homeజాతీయంఅమరావతి క్వాంటమ్‌ వ్యాలీ

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ

- Advertisement -

– దేశానికి గేమ్‌ ఛేంజర్‌: ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి:
అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ దేశానికి గేమ్‌ ఛేంజర్‌ కానుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ”రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్యార్థులపైనే ఆధారపడి ఉంది. అందుకే నా ఆశన్నీ వారిపైనే. చరిత్ర రాయాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా యువతకే సాధ్యం. మన యువత సాంకేతిక రంగంలో క్వాంటమ్‌ వేగంతో దూసుకెళ్తోంది. క్వాంటమ్‌ ప్రాజెక్టుకు ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే ఉత్పత్తి, సరఫరా చేస్తాం. హైటెక్‌ సిటీ.. హైదరాబాద్‌కు గేమ్‌ ఛేంజర్‌గా మారింది. కానీ, ఈ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ దేశానికి గేమ్‌ ఛేంజర్‌ కానుంది. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు ఇక్కడే ఉన్నాయి. వచ్చే 40 ఏండ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం.

రైతుల భూ త్యాగంతో నిర్మితమవుతున్న రాజధాని అమరావతి ప్రపంచానికి ఓ నమూనా. ప్రజలు మరో 30-40ఏండ్లు అదనంగా బతికేలా గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. సాంకేతికత గొప్పతనాన్ని అందిపుచ్చుకునే ప్రధాని మనకు ఉండటం అదృష్టం. కుప్పంలో ఏడో తరగతి విద్యార్థి ఏఐని అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టించాడు. రాష్ట్రంలోని 50లక్షల మంది యువత ఏఐ నేర్చుకుని అద్భుతాలు సృష్టించాలి. డ్రోన్‌ సిటీ, ఏరో స్పేస్‌, మెడ్‌ టెక్‌, స్పేస్‌ సిటీ లాంటివి రాష్ట్రంలో అందుబాటులో తెస్తున్నాం. అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. భారత దేశపు క్వాంటమ్‌ భవిష్యత్తు కేంద్రంగా అమరావతి నిలవనుండటం చరిత్రాత్మకం.అని చంద్రబాబు అన్నారు.

ఏప్రిల్‌ 14న ఇక్కడ మరో రెండు క్వాంటమ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. 2030లోగా 2.5 లక్షల మంది క్వాంటమ్‌ నిపుణులు కావాలి. దేశంలోని వందమంది ఐటీ నిపుణుల్లో 35శాతం మంది తెలుగువాళ్లే. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీలు ఏపీకి గేమ్‌ ఛేంజర్లు. క్వాంటమ్‌ వ్యాలీకి శంకుస్థాపన చేసిన ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. అమరావతి కూడా జితేంద్రసింగ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంన్నారు.కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఏపీ రాష్ట్రమంత్రులు నారా లోకేశ్‌, నారాయణ, కందుల దుర్గేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -