- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: పేద ప్రజలకు చేయూత అందించడమే ఇఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ అన్నారు.గట్టుప్పల్కు చెందిన కమ్మం యాదయ్య పక్షవాతంతో నెల రోజులుగా కోమాలో ఉండగా,వారి కుటుంబ సభ్యులను మంగళవారం ఫౌండేషన్ ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరఫున బాధిత కుటుంబానికి 30,000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -



