- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఏపీ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా హరీశ్ కుమార్ గుప్తా పూర్తిస్థాయిలో నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ప్రభుత్వం తాజాగా పూర్తిస్థాయి నియామకం చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, హరీశ్ కుమార్ గుప్తా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. జమ్మూకశ్మీర్కు చెందిన ఆయన, ఉమ్మడి ఏపీలో ఖమ్మం ఏఎస్పీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం మెదక్, పెద్దపల్లిలలో కూడా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా సేవలందించారు.
- Advertisement -