సింగిల్స్లో నంద్యాల నరసింహారెడ్డి శుభారంభం
హైదరాబాద్ : 23వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ (అర్బన్రైజ్ కప్) బుధవారం అట్టహాసంగా ఆరంభమైంది. దేశవ్యాప్తంగా 300 మందికిపై క్రీడాకారులు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్ను హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హెచ్ఓటీఏ) నిర్వహిస్తుండగా.. అర్బన్రైజ్, సిటీ న్యూరో సెంటర్, జిటిఎన్ ఇండస్ట్రీస్ గ్రూప్, క్రిట్జ్ ఇండియా, విని టాయ్స్ లు స్పాన్సర్ చేస్తున్నాయి. జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్, ఫిల్మ్నగర్ క్లబ్, జిహెచ్ఎంసీ టెన్నిస్ కోర్టుల్లో బుధవారం సింగిల్స్, డబుల్స్ మ్యాచ్లు మొదలయ్యాయి. జెహెచ్ఐసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన పురుషుల 55 ప్లస్ సింగిల్సలో నంద్యాల నరసింహారెడ్డి శుభారంభం చేశారు. రాజారామ్ మోహన్ రాయ్ పై 9-2తో నరసింహారెడ్డి గెలుపొందారు. మెన్స్ 60 ప్లస్ సింగిల్స్లో గంగాధర్ 9-5తో వెంకట రత్నంపై విజయం సాధించాడు. ఈ నెల 14న జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో అన్ని విభాగాల్లో ఫైనల్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.



