Tuesday, June 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాణాసంచా గోదాంలో పేలుడు.. ఏడుగురు మృతి

బాణాసంచా గోదాంలో పేలుడు.. ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జైపూర్‌లోని ఓ బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. తలాయ్ కాలనీలో బాణసంచా నిల్వ ఉంచిన ఒక ఇంట్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఏడుగురు తీవ్రంగా గాయపడి మరణించారని ధృవీకరించారు. మృతులను సమీర్, ఆబిద్, నాసిర్, అబ్దుల్ వాహిద్, బిలాల్‌గా గుర్తించగా మరో బాధితుడి వివరాలు తెలియరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -