- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో గ్రనేడ్ పేలి ఇద్దరు సైనికులు మృతిచెందారు. కమల్కోట్లో ఉన్న శిబిరంలో సైనికులు పరికరాలను అప్పగిస్తుండగా ప్రమాదవశాత్తూ గ్రనేడ్ పేలింది. దీంతో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడగా వారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
- Advertisement -



