- Advertisement -
అమెరికా దాడులపై నిరసన
న్యూఢిల్లీ : భారత నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి ప్రాణాంతక చర్యలు సమర్ధనీయం కావని చెప్పారు. ‘మార్కో రుబియోతో మాట్లాడాను. ముగ్గురు భారత నావికుల మరణానికి కారణమైన అమెరికా సేనల దాడిపై భారత్ నిరసనను పునరుద్ఘాటించాను’ అని జైశంకర్ తెలిపారు. భారత నావికులతో ప్రయాణిస్తున్న నౌకలపై ఈ వారంలో ఒమన్ తీరంలో దాడులు జరిగిన విషయం తెలిసిందే. వీటిలో ఓ నౌకపై ఈ నెల 10న జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -



