- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్ట్ లండన్లోని సౌత్ హాల్ ప్రాంతంలో భారతీయ సంతతికి చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. జూన్ 11 అర్ధరాత్రి నార్త్ రోడ్–డార్మర్స్ వెల్స్ లేన్ జంక్షన్ వద్ద గుర్తుతెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన గుర్భేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడగా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. అక్కడి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, సాక్షుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
- Advertisement -



