- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాపికొండల బోటింగ్ను అధికారులు నేటినుంచి (ఆదివారం) తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటక బోట్ల నిర్వహణ, భద్రతపై పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశంతో ఒక ఏపీ టూరిజం, 15 ప్రైవేట్ బోట్లను నిలిపివేశారు. భద్రతా తనిఖీలు ముగిశాక యథావిధిగా బోట్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -



