Sunday, February 15, 2026
E-PAPER
Homeఖమ్మంకానిస్టేబుల్ వెంకట్ జ్ఞాపకార్ధం అన్నదానం

కానిస్టేబుల్ వెంకట్ జ్ఞాపకార్ధం అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
కానిస్టేబుల్ నార్లపాటి వెంకట నాగేశ్వరరావు (వెంకట్) వర్ధంతి ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులు వృద్దులకు అన్నదానం చేసారు.  మున్సిపాల్టీ పరిధిలోని పేరాయిగూడెం కు చెందిన వెంకట నాగేశ్వరరావు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లోనే విధులు నిర్వహించేవాడు.అయితే ఐదేళ్ళ క్రితం రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ప్రమాదానికి గురై మరణించాడు.

ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం తన తల్లిదండ్రులు దశరథ్ (దాసు) – దుర్గమ్మ,భార్య నాగాంజలి,పిల్లలు జాహ్నవి,అభినవ్ జయ్ సూర్య,అత్తమామలు సుందరి శ్యామల – తగరం యర్రయ్య లు అశ్వారావుపేట లోని అమ్మ సేవా సదనం లోని వృద్దులకు అన్నదానం చేసారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -