- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంలోని శివాలయం తోపాటు ఆడెల్లి, ధని గోపాల్ పెట్,ఆలూరు, రాజరాజేశ్వర ఆలయం వంజర్ లోని సంగమేశ్వర ఆలయం యాంకర్ పల్లె లోని బసవేశ్వర్ ఆలయం, చించోలి(బి) దుబ్బరాజేశ్వర్ ఆలయం బీరవెల్లి,మార్కండేయ ఆలయాల్లో ఆలయంలో ఆదివారం ఉదయం నుండే భక్తులు పాలాభిషేకం, బిల్వపత్రలు సమర్పించి పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో వేద పండితుల మంత్రాత్సవాల మధ్య శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
- Advertisement -



