- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలోని మైసూరు ఆర్టీనగరలో ఉన్న ‘ఫాక్స్ జెన్ పబ్’లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సాహిన్, ప్రకాశ్ అనే ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సరైన ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం, పైకప్పు రెల్లు గడ్డితో కప్పి ఉండటం, మద్యం సీసాలు పగిలి మంటలు వేగంగా వ్యాపించడం వంటి కారణాలతో ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపకదళ అధికారి రంగనాథ్ తెలిపారు.
- Advertisement -



