- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో టెట్ నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు 10 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. 16 జిల్లాల్లోని 61 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. పేపర్-1కు 50,113 మంది, పేపర్-2కు 1,03,639 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
- Advertisement -



